*వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ*

మునగాల, ఆగష్టు 19(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో శుక్రవారం స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మునగాల ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పుట్టినరోజు వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు అనాధాశ్రమం అనాధలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వారి ఆకలిని తీర్చి మానవతా దృక్పథంతో వారికి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ముకుందాపురం ఎంపీటీసీ నూకమళ్ళ ఇందిరా రామకృష్ణ, పందిరి నాగిరెడ్డి, ఆశ్రమ నిర్వాహకురాలు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.