*వెంకటనర్సు పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన జెడ్పిటిసి.

 చిట్యాల19( జనంసాక్షి) మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు అల్లం రవీందర్, తిరుపతి గార్ల తండ్రి అల్లం వెంకట నర్సు సోమవారం అనారోగ్యంతో మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను జెడ్పిటిసి గొర్రె సాగర్ పరామర్శించి వారి పార్తివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారి వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరెపెల్లి మల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ క్రాంతికుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ కట్కూరి పద్మా నరేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నవీన్, టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు పుల్లూరి సతీష్, పెరుమండ్ల రవీందర్ గౌడ్, పూర్ణచంద్రరావు, చిలుముల రమణాచారి, ఆకుల రవీందర్, బైరం భద్రయ్య, దామేర రాజు, కందుల రమేష్,  చేరి రవీందర్, సాదుల రవీందర్, పిట్టల రమేష్, ఏరుకొండ ఐలయ్య, గుర్రపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.