వేర్పాటువాదంపై రాజీ లేదు

l3l5rm07జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు ముస్రత్ ఆలం విడుదలపై.. రాష్ట్రంలో భాగస్వమ్యపక్షమైన బీజేపీకిగాని, కేంద్రానికిగాని ఎలాంటి సమాచారం లేదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆలం విడుదలకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ప్రధాని మోడీ లోక్ సభలో ప్రకటన చేశారు. ఆలం విడుదలపై ప్రజల్లో వ్యక్తమై భావాలు, సభ్యుల ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నానని ప్రధాని చెప్పారు. అటు వేర్పాటువాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం రాజీపడబోదన్నారు ప్రధాని.