వైరల్‌ ఫీవర్‌తో పార్లమెంటుకు సోనియా దూరం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న, ఇవాళ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. ఆమె వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే సమావేశాలకు హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోనియా యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు.