శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయి కృషి

జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు
మహాబూబ్ నగర్ ,డిసెంబరు 5 (జనంసాక్షి ) :
శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు  అన్నారు.  సోమవారం రోజు తన కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను ఎస్.పి.  స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఎస్.పి. ఆదేశించారు.
నేటి ఫిర్యాదుల వివరాలలో…
స్వార్జితమైన తన ఆస్థిని అందరు కుమారులకు సమానంగా పంచేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఒక కుమారుడు వ్యతిరేతిస్తూ దాడులు చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది.
తన శారీరక అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రానున్న పోలీస్ కానిస్టేబుల్ దేహ దారుడ్య పరీక్షకు హాజరయ్యే తేదీని మార్చాలని ఇరువురు అభ్యర్థులు ఎస్.పి. గారికి అర్జీ పెట్టుకున్నారు.
అదేవిధంగా కుటుంబ కలహాలు, భూమి తగాదాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులతో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పలువురు బాధితులు ఎస్.పి. గారిని కలిసి న్యాయం జరిపించాలని కోరారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు  బాధితులకు న్యాయం చేసేందుకు చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.