*శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి*: ఎస్ ఐ రామస్వామి

 పెబ్బేరు అక్టోబర్ 17 ( జనంసాక్షి): శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలందరు భాగస్వాములు కావాలని  పెబ్బేరు ఎస్ ఐ రామస్వామి అన్నారు. సోమవారం
హైదరాబాద్ కు చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) సిబ్బంది  తో ఎస్ ఐ రామస్వామి పెబ్బేరు పట్టణ కేంద్రంలో కవాతు నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొల్లాపూర్ చౌరస్తా, ప్రధాన దారుల్లో అర్ ఏ ఎఫ్  సాయుధలైన సిబ్బంది, స్థానిక పోలీసులతో  ఊరేగింపుగా కావత్ ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా ఎస్ ఐ రామద్వమి మాట్లాడుతూ సమాజంలో శాంతి, భద్రతలకు పోలీసుల కృషి ఉందని అన్నారు. పోలీసుల ప్రజల నుండి సహకారం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు వెంకట్ రెడ్డి, రోశయ్య,  నర్సన్ గౌడ్,రాములు, కానిస్టేబుల్ రమేష్,రవి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Attachments area