శెట్టి ఆత్మకూరు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలి…

గద్వాల రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి):- గద్వాల మండల పరిధిలోని శెట్టి ఆత్మకూరు గ్రామానికి వెళ్లే రోడ్డు పై వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది పాటి వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటే గ్రామస్తులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొద్దీపాటి వర్షానికి నిత్యం వెళ్ళే రోడ్డు చెరువులను తలపిస్తుంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలంటే రోడ్డు పై వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో అక్కడ ఏర్పడిన గుంతలో ద్విచక్ర వాహనా దారులు నిత్యం ప్రమాదాలకు గురౌతూ ఉనరని,నిత్యం విద్యార్థులు ఉన్నత చదువు లకై గద్వాల పట్టణానికి ఇబ్బందికర పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారు.. సైకిల్ ను తీసుకొని కొద్ది దూరం నడుచుకొని రోడ్డు దాటి వెళ్ళాలి. ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుపై బ్రిడ్జి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు..