శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న ఆలయ చైర్మన్

మల్దకల్ ఆగస్టు 21 (జనంసాక్షి) మల్దకల్ మండల పరిధిలోని సద్దలోనిపల్లి శ్రీ స్వయంభు కృష్ణ స్వామి దేవాలయాన్ని ఆదివారం మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ ప్రహల్లాద రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారికి ఆలయ అర్చకులు పాండురంగయ్య స్వాగతం పలికి అర్చనలు చేయించి శాలువా, స్వామివారి చిత్రపటం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.