శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నా :సోనియా

న్యూఢిల్లీ : శ్రీలంకలో మానవక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్య క్షురాలు సోనియాగాంధీ అన్నారు.శ్రీలంక తమిళుల సమస్యలపై యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. శ్రీలంకలో తమిళులపై దౌర్జన్యాలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. భారత జాలర్లను కాల్చిచంపిన ఘటనలో ఇటలీ నావికులను తిరిగి పంపించేందుకు ఆదేశం నిరాకరించిన ఘటనపై కూడా సోనియా స్పందించారు. భారత్‌ జాలర్లను కాల్చి చంపిన ఘటనలో ఇటలీ నావికులను తిరిగి పంపించేందుకు ఆదేశం నిరాకరించిన ఘటనపై కూడా సోనియా స్పందించారు. భారత్‌ విషయంలో ఏం చేసినా చెల్లుతుందని ఏ దేశం అనుకోకూడదని అన్నారు.