శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

 జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 23:మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ అధ్యక్షులుగా బోళ్ల రామచంద్రయ్య ప్రధాన కార్యదర్శిగా కంకల కిష్టయ్య కోశాధికారిగా ఎమ్మె లక్ష్మయ్య వీరితోపాటు కమిటీ సభ్యులచే స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కుందారపు యశోద కొమురయ్య పల్లెర్ల భాగ్యమ్మ రాజు పోలేపాకు బిక్షపతి మారోజు అనిల్ కుమార్ గుండా సందీప్ మాటూరు శివకుమార్ బత్తిని సైదులు మారవోని యాదగిరి పెద్ద గౌడ్ మారవుని మల్లయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.