*సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడు*

 ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలు గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడని కాంగ్రెస్ పార్టీ  అలంపూర్ యువజన నాయకుడు, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల తలరాతల్ని మార్చ్ తెలుగు ప్రజల గుండెల్లో అంతులేని ప్రేమభిమానాలకు శాశ్వత కీర్తి పొందిన నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండపేట నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం నారాయణ నాయుడు, వేముల శ్యామ్, సుదర్శన్ రెడ్డి తో పాటు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.