సంగారెడ్డి పట్టణం నుంచి కన్యాకుమారికి సైకిల్‌యాత్ర చేపట్టాడు.

(సంగారెడ్డి జనం సాక్షి న్యూస్) సంగారెడ్డి పట్టణంలోని బృందావన్‌నగర్‌ కాలనీకి చెందిన ఇంటర్‌ విద్యార్థి దానేశ్వర్‌రెడ్డి సంగారెడ్డి పట్టణం నుంచి కన్యాకుమారికి సైకిల్‌యాత్ర చేపట్టాడు. సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో సైకిల్‌ యాత్రను రాష్ట్రహోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ జెండా ఊపి ప్రారంభించారు. గతంలో లద్దాఖ్‌కు సైకిల్‌యాత్ర చేపట్టినట్టు దానేశ్వర్‌రెడ్డి తెలిపాడు.