సంజయ్‌దత్‌ కంటతడి

– క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోను
– గడువులోపల లొంగిపోతా
ముంబాయి : మీడియా సమావేశంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సుప్రీకోర్టు తీర్పునకు కట్టుబడివుంటానని, ఇచ్చిన గడువు లోపల లొంగిపోతానని చెప్పారు. క్షమాభిక్ష కోసం తాను దరఖాస్తు పెట్టుకోనని సంజయ్‌దత్‌ స్పష్టం చేశారు. క్షమాభిక్ష అర్హులైన వారెందరో ఉన్నారని ఆయన అన్నారు. తనకు, తన కుటుంబానికి ఇది కష్టసమయమన్న సంజయ్‌దత్‌ ఈ సమయంలో తమకు అండగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో అయన ఎంతో ఉద్వేగంతో నాలుగు మాటలు మాత్రమే మాట్లాడి వెళ్లిపోయారు. సోదరి ప్రియాదత్‌ ఆయన వెన్నంటే ఉన్నారు. సోదరుడిని అక్కున చేర్చుకునిక పలుమార్లు ఆమె ధైర్యం చెప్పారు.