సంజయ్‌ దత్‌ను కలిసిన యోగి

నాలుగేళ్లలో బీజేపీ పథకాలతో రూపొందించిన పుస్తకం అందజేత

లక్నో, జూన్‌9(జనం సాక్షి ) : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా సంజయ్‌ దత్‌ను కలిసిన యోగి.. గత నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయనకు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారమున్న ఓ పుస్తకాన్ని యోగి.. సంజూకు అందజేశారు. ఈ ఫొటోలను యూపీ సీఎం తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడుఅమిత్‌ షా సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌ ప్రచారం చేపట్టారు. గత ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చిన వారందరి ఆశీర్వాదాలు ఇప్పుడు కూడా తమకు ఉండాలని భాజపా అధిష్ఠానం కోరుకుంటోంది. ఇందులో భాగంగానేదేశవ్యాప్తంగా భాజపా నేతలు పలు రంగాల్లోని ప్రముఖులను కలిసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌, గాయని లతా మంగేష్కర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌టాటాలతో అమిత్‌ షా భేటీ అయ్యారు. ఇక కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నిన్న బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీమ్‌ఖాన్‌లను కలిశారు