సంస్కరణల అమల్లో ముందున్న తెలంగాణ

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్‌ సాధించింది. ఢిల్లీలో జరిగిన స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ అసెస్‌ మెంట్‌ 2018 కార్యక్రమంలో భాగంగా సులభతర వాణిజ్యం ర్యాంకులు విడుదల చేశారు. ఈ ర్యాంకుల్లో సంస్కరణల అమలులో తెలంగాణతోపాటు ఏపీ, జార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు వందశాతం స్కోర్‌ సాధించగా..అసోం, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ పురోగతి సాధించాయి. ఆస్తుల రిజిస్టేష్రన్లలో ఛత్తీస్‌గఢ్‌, పన్నుల చెల్లింపులో ఒడిశా, నిర్మాణ రంగ అనుమతుల్లో రాజస్థాన్‌, కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్‌, పర్యావరణ రిజిస్టేష్రన్లకు సంబంధించి కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు వంద శాతం స్కోర్‌ సాధించాయి.