‘సబ్కా సాత్ – సబ్కా వికాస్’
మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ.. ‘సబ్కా సాత్ – సబ్కా వికాస్’ అనేదే ప్రధాన ఉద్దేశమని అన్నారు. తొలిరోజు నుంచి తీసుకున్న చర్యల్లో భాగమే ఈ నోట్ల రద్దు అన్నారు. డబ్బు స్వతంత్రంగా వెల్లడించాలన్న పిలుపునకు మంచి స్పందన వచ్చిందన్నారు. బినామీ లావాదేవీల బిల్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలకు చేరువ కావాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని పార్టీలు దిగ్భ్రాంతికి గురయ్యాయని తెలిపారు. నల్లధనం ఉన్నవారే నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. కాంగ్రెస్ ఎందుకో రకరకాలుగా మాట్లాడుతుందన్నారు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు.