సభ్యత్వ నమోదు చేపట్టిన యుటిఎఫ్

జనం సాక్షి, వంగూర్:
యూటీఎఫ్ సభ్యత్వ క్యాంపెన్ లో భాగంగా శుక్రవారం డిండిచింతపల్లి ఉమ్మాపూర్, నిజాంబాద్, తిప్పారెడ్డిపల్లి, సర్వారెడ్డిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రనాయకులు చిన్నయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సత్వరమే న్యాయం చేయలని, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని గౌరవ ముఖ్య  మంత్రివర్యులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె లింగమయ్య, శ్యామలయ్య, నర్సింహ్మ మరియు మండల కమిటీ అధ్యక్షులు ఇ.జంగయ్య ప్రధాన కార్యదర్శి బి.తిరుమలేశ్, జిఎచ్ యంఎల్ పర్వతాలు ,దుర్గాప్రసాద్, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.