సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని ఏర్పాటు చేయండి

 

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు విన్నవించిన ‘గోపా’ నాయకులు

 

కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి / సోమవారం మహబూబాబాద్ జిల్లా గౌడ (గోపా) నాయకులు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ని కలిసి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు గురించి కోరగా వారు సానుకూలంగా స్పందించి మహబూబాబాద్ జిల్లా టౌన్ లోని ప్రధాన కూడలి లో ఏర్పాటు చేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ… బహుజన నాయకులు గౌడులు విద్య పరంగా ,జ్ఞానం పరంగా ఉన్నత శ్రేణికి చెందిన వారని గౌడుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ ,మోడెం రవీందర్,చిర్రా యాకాంతం గౌడ్,చిలువేరు సమ్మయ్య గౌడ్,కదర ప్రకాశ్,కేసముద్రం మండల అధ్యక్షులు కూటికంటి మధు,మండల నాయకులు పెదగాని వెంకన్న,మురళి,గడ్డం రాజశేఖర్ లు పాల్గొన్నారు