సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి /మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తాళ్ల పూసపల్లి గ్రామము నందు సోమవారం గ్రామ సర్పంచ్ రావుల విజిత రవిచందర్‌ రెడ్డి అధ్యక్షతన వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,ఉపసర్పంచ్,వార్డ్ మెంబర్స్ ,కోషన్స్ సభ్యులు,అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎమ్ ,ఆశ వర్కర్స్,వివోల తో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని జాతీయ జెండాను పంపిణీ చేయడం జరిగింది.రోజువారి కార్యక్రమాలను చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల రమేష్,వార్డు సభ్యులు రామ్మూర్తి, కాలేరు మల్లయ్య రాధమ్మ,పంచాయతీ కార్యదర్శి దివాకర్,బండి వెంకన్న ,ప్రశాంత్ ,రమేష్,బుచ్చాలు తదితరులు పాల్గొన్నారు.