సలాం ముంబయి
ప్రపంచంలో అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో భారత్ది 8వ స్థానం. డిసెంబర్ 2015 నాటి లెక్కల ప్రకారం ఇది 2073.54 బిలియన్ డాలర్లు. ఇందులో ఒక్క ముంబయి నగరం వాటానే 278 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం జీడీపీలో దాదాపు 7%. 30% ఆదాయపుపన్ను రాబడి, 60% కస్టమ్స్ సుంకం, 20% కేంద్ర ఎక్సైజ్ పన్ను వసూళ్లు, 40% విదేశీ వాణిజ్యం, రూ.40,000 కోట్ల కార్పొరేట్ పన్నులు ఇక్కడి నుంచే లభిస్తాయి.
ముంబయి అందిస్తున్న జీడీపీ 278 బి.డాతో పోలిస్తే ప్రపంచంలోని చాలా పెద్ద దేశాలు దిగదుడుపే కావడం గమనార్హం. దాయాది పాకిస్థాన్ (269 బి.డా), చిలీ (240), పోర్చుగల్ (198), గ్రీస్ (193), బంగ్లాదేశ్ (195), వియత్నాం (193), పెరూ (192), న్యూజిలాండ్ (173), కువైట్ (112), శ్రీలంక (82), మయన్మార్ (64), పనామా (52), నేపాల్ (20), మారిషస్ (11.51 బి.డా) దేశాలదీ తక్కువే. ప్రపంచంలోని దాదాపు వంద దేశాల జీడీపీ ముంబయి కన్నా తక్కువ ఉండటం గమనార్హం.