సాక్షి మాలిక్ కు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం

sakshi-malik_ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ కు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. ఏయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా బయల్దేరిన సాక్షికి దారి పొడవునా స్కూల్ విద్యార్ధులు నిలబడి స్వాగతం తెలిపారు. అనంతరం హర్యానా ప్రభుత్వం తరుపున సాక్షిని సన్మానించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారాన్ని అందజేశారు. అంతేకాదు సాక్షికి గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని తెలిపారు.బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సాక్షి మాలిక్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ఖట్టం ప్రకటించారు.