సామూహిక గోరింటాకు పండగ

నేడు మహిళలకు ఉచితంగా అందచేత

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): నియోగి బ్రాహ్మణమహిళ సంఘం …ధన్వంతరి ఫావుండేషన్‌ల అద్వర్యంలో. అషాడమాసం సంధర్బంగా గోరింటాకు పండుగ నిర్వహిస్తున్నట్లు…సంఘం జిల్లా అధ్యక్షరాలు పరిమి అనంత లక్ష్మీ…ధన్వంతరి ఇంచార్జి సోమరాజు శ్రీదేవి..అధిరాజు పద్మావతి తెలిపారు. ఆదివారం ఖమ్మం లోని మామిల్లగూడెం సంఘం కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం చేపట్టారు. కుల.మత..ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించించారు. గోరింటాకు రుబ్బింది ఈ సంధర్బంగా అందరికి ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు.. సామూహికంగా మహిళలు ఒక్కచోట గోరింటాకు పెట్టుకోవాలి..ఆత్మీయ కలయిక జరగాలని కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు..గోరింటాకు డిజైనర్లను ఆహ్వానించామన్నారు.