సామూహిక జాతీయ గీతాలాపన

అందరి నోట జన గణ మన గీతం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు మంగళ వారం క్యాతన్ పల్లి మున్సిపల్ శాఖ, పట్టణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉదయం 11-30 నిమిషములకు , పట్టణంలోని అన్ని వాడలలో, ముఖ్య కూడళ్ళలో , 52సెకన్ల పాటు జాతీయ గీతాలాపన సామూహిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, పట్టణ ఎస్సై బి అశోక్, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పలు కుల, వ్యాపార, వాణిజ్య సంఘాలు,ఆటో యూనియన్, స్వచ్ఛంద సంస్థలు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్స్, స్వచందంగా పాల్గొని దేశ భక్తితో కూడిన జాతీయతను చాటుకున్నారు