సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ర్ట కమిటి సభ్యులుగా రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన గొరిగె సోములు ను ఎన్నుకోవడం జరిగింది. మహబూబాద్ లో జరిగిన రాష్ర్ట మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్బంగా సోములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం బలమైన పోరాటాలు నిర్వహిస్తానని, నమ్మకంతో బాద్యత ఇచ్చిన రాష్ర్ట నాయకత్వానికి దన్యవాదాలు తెలిపారు. సోములుకు సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి,నాయకులు జుంపాల మహేష్,వంగాల మారయ్య,ఆదిమల్లయ్య,గాదె కృష్ణ తదితరులు అభినందించారు.