సిపిఎం పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరిక

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ వార్డ్ మెంబర్స్ లక్ష్మయ్య, గణం మల్లయ్య వారితో పాటు కార్యకర్తలు మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో వనపర్తి సభలో టిఆర్ఎస్ పార్టీలో 50 మంది కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి కార్యకర్తలకు కండువలు కప్పి ఆహ్వానించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వంగూర్ మండల పార్టీ అధ్యక్షుడు పులిజాల కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆనంద్ రెడ్డి, రామస్వామి, శరత్ రెడ్డి, సాయి బాబా తదితరులుపాల్గొన్నారు.
Attachments area