సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలు జయప్రదం చేయండి

— సిపిఐ జిల్లా నాయకులు గుగులోత్ రామచందర్ — సిపిఐ జిల్లా నాయకులు గుగులోత్ రామచందర్ టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు సెప్టెంబర్ 4,5,6,7 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే మహాసభలు జయప్రదం చేయాలని 4వ తారీకున బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామచందర్ కోరారు. టేకులపల్లి లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల వర్గం కష్టజీవుల పక్షాన పోరాడే సిపిఐ పార్టీ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరన్ని ప్రజా ఉద్యమాలు ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయాలని భవిష్యత్ కర్తవ్యాల నిర్వహణ కొరకు సెప్టెంబర్ 4,5,6,7 తేదీలలో శంషాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ మూడవ మహాసభలు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు వేదిక కానున్నాయని అన్నారు. లక్షలాది మందితో శంషాబాద్ లో బహిరంగ సభ ఉందని ప్రజలు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎజ్జు భాస్కర్, భాను ,ఐతా శ్రీరాములు, బానోత్ వీరన్న ,ఇస్లావత్ రవీందర్, తేజావత్ మధు, v. సతీష్, రాంబాబు, సోనీ తదితరులు పాల్గొన్నారు.