సిరియాపై ఫ్రాన్స్ గగనతల దాడులు
హైదరాబాద్ నవంబర్17(జనంసాక్షి):
సిరియా నగరంపై ప్రాన్స్ గగనతల దాడులతో విరుచుకు పడుతోంది. ఐఎస్ స్థావారాల లక్ష్యంగా అధికారులు ప్రకటిస్తున్నప్పటికి అమాయికులు ఇదాడుల్లో చనిపోతున్నటుంటగా సమాచారం. తాజాగా మరోసారి సిరియాలోని వైమానిక దాడులు చేపట్టారు. ఆదివారం రాత్రి కూడా ఫ్రాన్స్ అధికారులు సిరియాలోని రక్కా నగరంపై వైమానిక దాడులు చేసి ఇస్లామిక్ స్టేట్ శిక్షణా శిబిరాన్ని కూల్చివేశామని ప్రకటించుకున్నారు. ఇప్పుడు మళ్లీ దాడులు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గత శనివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిస్లో విచాక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. 129మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఏడు సార్లు వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ప్రాణ నష్టం వివరాలు మాత్రం తెలియరాలేదని వారు పేర్కొన్నారు. పారిస్లో ఉగ్రదాడిపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ¬లాండే వచ్చేవారం అమెరికా, రష్యా దేశాలకు వెళ్లనున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్యలు జరపనున్నట్లు సమాచారం. పారిస్పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదాడికి ఫ్రాన్స్ ప్రతీకారంతో రగిలిపోతోంది. దేశవ్యాప్తంగా ఫ్రాన్స్ అధికారులు దాడులను విస్తృతం చేశారు. మంగళవారం ఉదయం 128ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధం ఉందని భావిస్తూ.. 23మంది అనుమానితులను అరెస్టు చేశామని.. వారి వద్ద నుంచి 31ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు . ఐఎస్పై కొందరు హ్యాకర్లు యుద్ధం ప్రకటించారు. పారిస్పై ఉగ్రదాడిని నిరసిస్తూ.. వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం యూట్యూబ్లో ఒక వీడియోని విడుదల చేశారు. ముఖానికి మాస్క్, నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి వీడియోలో కనిపించాడు. తమ లాంటి హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. నవంబర్ 13న పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారని వారికి వ్యతిరేకంగా ఆపరేషన్ని ప్రారంభించామని.. తమ సైబర్ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ వీడియో విడుదల చేసిన ఒక్కరోజులోనే 1.3మిలియన్ల మంది వీక్షించారు.