సిసి రోడ్డు పనులు ప్రారంభించిన

ఎమ్మెల్యే  మదన్ రెడ్డి
  నర్సాపూర్. సెప్టెంబర్, 17, (  జనం సాక్షి ) :
 నర్సాపూర్ పట్టణ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. శనివారం నాడు నర్సాపూర్ పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా  రూపాయలు 15 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తో కలిసి    కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో 10 కోట్ల 75 లక్షల వ్యయంతో అవసరమున్న చోట సిసి రోడ్ల తోపాటు మురికి కాల్వలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.  నర్సాపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడానికి పార్టీలకతీతంగా కలిసి రావాలని ఆయన కోరారు.
 ఈ కార్యక్రమంలో  కమిషనర్ చాముండీశవారి, మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం,  కౌన్సిలర్ అశోక్ గౌడ్,  రామ్ చందర్,  భుచెస్ యాదవ్,  రాజేందర్ ,సురేష్,   టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి తదితరులు ఉన్నారు.
 ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 4  సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి
Attachments area