సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అని.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి చెట్లను పెంచాలని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ఒకటవ వార్డు లో మున్సిపల్ కార్యాలయం నుండి మొక్కలను పంపిణీ చేసి ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి ఒకటో వార్డ్ కౌన్సిలర్ కొండారెడ్డి సభాధ్యక్షత వహించగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,మున్సిపల్ మేనేజర్ రవీందర్,మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజ మైనోద్ధిన్, చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,ఎరుకలి తిరుపతయ్య, తెరాస నాయకుల లక్ష్మన్న గారి రవీందర్ రెడ్డి,మున్సిపల్ హరితహారం ఉద్యోగి కృపయ్య, ఆర్పి లు లావణ్య,జగదీశ్వర్ రెడ్డి లతో పాటు వార్థుకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.