సీసీ కెమెరాలకు ఆటో యూనియన్ విరాళం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆటో యూనియన్ గ్రామ అధ్యక్షుడు బీర రాములు, ప్రధాన కార్యదర్శి తాటికొండ చక్రధర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ లో 5వేల రూపాయలను చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ నాయకులు గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులు ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా విరాళం అందించిన ఆటో యూనియన్ సభ్యులను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోతి ఆంద్రయ్య, చీపురు రాజు,రణం ప్రశాంత్, అమరగొండ నర్సింహులు, కొంక  వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.