సుంకేసులకు వరద

రాజోలి 19 ఆగస్టు (జనం సాక్షి)
రాజోలి…సుంకేసుల డ్యామ్ కి ఎగువ నుండి వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరటం తో సుంకేసుల అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.శుక్రవారం ఎగువనుండి40వేల588క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రాగా 9 గేట్లు తెరిచి 38 వేల 493క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రేశైలం కు వదిలి 2,095 క్యూసెక్కుల ను కె సి కెనాల్ కు విడుదల చేసినట్లు జేఈ రాజు తెలిపారు