సులానగర్ పంచాయతీ కార్యాలయం ముందు సామూహిక జాతీయ గీతాలాపన

టేకులపల్లి ,ఆగస్టు 16( జనం సాక్షి ):భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా టేకులపల్లి మండలంలోని ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలో సులానగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు జనం భారీగా చేరుకొని త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పంచాయతీ కార్యాలయం ముందు ఉదయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర బుజ్జి వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య వార్డు సభ్యులు గ్రామపంచాయతీలోని సులానగర్ జెడ్ పి ఎస్ ఎస్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ ఉపాధ్యాయులు విద్యార్థులు రాజకీయాలకతీతంగా ప్రజలందరూ సామూహిక జాతీయ గీతాలాపనలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.