*సూగూర్ క్రీడా మైదానం ఏర్పాటు కు తనవంతు సహకరమందించిన సింగిల్ విండో చైర్మన్*

పెబ్బేరు జూలై 5 ( జనంసాక్షి ): మండలంలోని
సుగూర్ గ్రామ క్రీడా ప్రాంగణానికి తనవంతు సహాయకరంగా పెబ్బేరు సింగిల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి  100 ట్రిప్పుల మట్టికి  విరాళం  అందించారు. సూగూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణానికి చూచిన ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో  గ్రామంలో ని యువకులు క్రీడా మైదానం కోసం  మీ వంతు సహకారం కావాలని కోదండరామిరెడ్డి కోరగా ఆయన  తక్షణమే  స్పందించి క్రేడా మైదానం ఏర్పాటు సహాయం చేసారని గ్రామ యువకులు తెలిపారు. సహకరించిన పెబ్బేరు మండల సింగల్ విండో అధ్యక్షుడు కోదండరామిరెడ్డి కి సుగూర్ గ్రామం తరుపున మరియు గ్రామ యువకుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరశురాం ,హర్ష వర్ధన్, రవి, ప్రవీణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Attachments area