సెల్‌ నంబర్‌ ఇవ్వలేదన్న కక్షతో బాలికపై దురాగతం

కిరోసిన పోసి నిప్పటించిన దుండగుడు
లక్నో,మే9(జ‌నం సాక్షి):  ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అజంపూర్‌ జిల్లాలోని పరిహ గ్రామంలో దారణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొబైల్‌ నంబర్‌ ఇవ్వలేదన్న కోపంతో మైనర్‌ బాలికపై కిరోసిన్‌ పోసి నిప్పంటిచాడు.  తీవ్రంగా గాయపగడ్డ బాలికను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. బాలిక పరిస్థితి విషయంగా ఉందని గ్రహించిన డాక్టర్లు ఆమెను వారణాసి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం?. అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ షాహి అనే వ్యక్తి సదురు మైనర్‌ బాలికను మొబైల్‌ నంబర్‌ ను ఇవ్వాలని తరుచూ బలవంతం చేసేవాడు. కాగా ఆ బాలిక నెంబర్‌ ఇవ్వడానికి తిరస్కరించింది. కాగా  మహ్మద్‌ షాహి మరోసారి బాలిక ఇంటికి వెళ్లి నంబర్‌ ఇవ్వమంటూ వేధించాడు. ఆ బాలికి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో మహ్మద్‌ షాహి ఆమె పై దాడికి దిగాడు. అనంతరం బాదిత బాలికపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. బాలిక కేకలు విన్న స్థానికులు సంఘటన స్థలానికి రాగా నిందితుడు మహ్మద్‌ షాహిన్‌ పారిపోడానికి ప్రయత్నించాడు. పారిపోతున్న అతడిని  పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.