సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలి

బుద్ధారంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డిఎస్పి*
*గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (11):*. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయనం మండలంలోని బుద్ధారం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 1లక్షతో నూతనంగా ఏర్పాటుచేసిన 11 సీసీ కెమెరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన గ్రామస్తులను అభినందించారు సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కలిగించారు అంతకముందు వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నవీద్, ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ పద్మమ్మ, ఉప సర్పంచ్ నాగరాజు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్ తదితరులు ఉన్నారు