స్క్వాష్‌ జట్టుకు ఈజిప్ట్‌ కోచ్‌ సేవలు

చెన్నై: ఈజిప్ట్‌ కోచ్‌ అష్రాప్‌ అల్‌ కరగుయి భారత స్వా్కష్‌ జట్టుకు కొన్నాళ్లు సేవలందించనున్నారు. ఆగస్టు 7-16 వరకు పోలాండ్‌లోని బిల్సో్క-బియాలాలో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా క్రీడాకారులకు తర్ఫీదునిచ్చేందుకు ఆయన భారత్‌కు చేరుకున్నారు. భారత స్క్వాష్‌ అకాడమీ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన భారత జట్టు సభ్యులతో మాట్లాడారు. సత్తా ఉన్న కుర్రాళ్లు ఇక్కడున్నారని పోలాండ్‌లో వారు ఆశ్చర్యానికి గురి చేయొచ్చని అష్రాఫ్‌ అన్నారు.