స్నేహితుని అంత్యక్రియలకు పదివేలు ఆర్థిక సహాయం

చౌడాపూర్,ఆగస్టు 26( జనం సాక్షి): చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కోస్గి లక్ష్మయ్య అనారోగ్యంతో నిన్న సాయంత్రం మరణించడం జరిగింది.అతని మరణ వార్త తెలుసుకున్న తోటి స్నేహితులు,మరికల్ పాఠశాలలో 1996-97 లో పదవ తరగతి చదివిన స్నేహితులందరూ కలిసి రూ.10 వేయిల రూపాయలు అందరూ సహృదయంతో అతని అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటస్వామి,రాజు,యాదయ్య,నర్సింలు,సంతు,రాజేష్,నరేందర్,ఉదయ్,సత్యం,వెంకటస్వామి తదితరులు పాల్గొనడం జరిగింది.