స్పందించిన డిపో సిఎ

జనార్దన్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో  తాండూర్ డిపో సిఎ స్పందించారు.శనివారం రోజున జరిగిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ  సమావేశం జరిగింది.ఇందులో విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం పూట బస్సు సౌకర్యం కోసం తాండూరు డిపో సి.ఏ జనార్దన్ జనం సాక్షి విలేకరి ఫోన్లో సంభాషించారు. పాఠశాల సమయంలో సాయంత్రం 4:10 నిమిషాల కు వచ్చే బస్సును 4:45 నిమిషాలకు వస్తే విద్యార్థి విద్యార్థులకు క్లాసులు మిస్ కాకుండా ఉంటాయని జనం సాక్షి పత్రికలో రాయడంలో ఈ వార్త కు స్పందించి తాండూరు డిపో సి.ఏ జనార్దన్ చొరవ తీసుకుంటామని తెలిపి మంగళవారం రోజున నాలుగు నలభై ఐదు నిమిషాలకు బస్సు వచ్చేలా చేశారు.బస్సు వచ్చినందుకు విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ డిపో సి.ఏ జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు.