స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు
దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు పలు ధారావాహికల్లో నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో విమానం క్యాబిన్ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ తిరస్కరించిందట. ఆమె పర్సనాలిటీ ఈ ఉద్యోగానికి సరిపోదని ఉద్యోగం ఇవ్వలేమని చెప్పారట. ఈ విషయాన్ని స్మృతి దిల్లీలో జరిగిన ఏపీఏఐ(ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యక్రమంలో వెల్లడించారు. క్యాబిన్ ఉద్యోగం ఇవ్వకపోవడం మంచిదైందని తర్వాత తనకు మెక్డొనాల్డ్స్లో ఉద్యోగం దొరికిందని అక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందేనని స్మృతి అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.