స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలు నాటారు

ముఖ్యఅతిథిగా ఎస్సై రమేష్ బాబు

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి /75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం ఇనుగుర్తి గ్రామంలో వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమంను సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ విజయ లలిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై రమేష్ బాబు హాజరై కార్యక్రమం ను ప్రారంభించారు.తదనంతరం పి ఈ టి, ఉపాధ్యాయ,అధ్యాపక బృందం ఆధ్వర్యంలో 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు