స్వయం కృషితో ఎదగాలి మహిళలకు శ్రీ నిధి రుణం బషీరాబాద్

ఆగస్టు 26, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో కొర్వీ చేడ్ ఘాన్ని గ్రామంలో శుక్రవారం వారం రోజున నూతనంగా సారీ బిజినెస్ షాపును ఎంపీటీసీ వడే శ్రీనివాస్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్వతమ్మ తిరుపతి మాట్లాడుతూ కొంత కాలంగా డాక్రా గ్రూపులో లోన్ తీసుకుంటూ కట్టుకోవడం వలన ఈ మధ్యన శ్రీనిధి లోను మంజూరు కావడంతో నాకు శ్రీనిధి నుంచి లక్ష రూపాయల లోను రావడం జరిగింది.అదే విధంగా బ్యాంకులో 50వేల రూపాయలు లోను తీసుకున్నాను. మొత్తం ఒక లక్ష యాభై వేల రూపాయలతో ఈ రోజు నేను ఈసారి బిజినెస్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం పద్మారావు మాట్లాడుతూ మహిళలు స్వయం కృషి తో ఎదగాలని ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర అంబన్న,మక్సుద్ (గోరే బై),వివోఎస్ సునీత చావన్,పంచాయతీ కార్యదర్శి రాజు, సేవ్య నాయక్,సాయి రెడ్డి గ్రామస్థులు,తదితరులు,పాల్గొన్నారు.