స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే సంకల్పం..

pm-modi_660_092314092006స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. సురాజ్యం ఏర్పాటు మన నిరంతర సంకల్పం కావాలని ఆకాంక్షించారు. సురాజ్యం కల సాకారం ఇంకా ఆలస్యం చేయరాదన్నారు ప్రధాని మోడీ.