స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 51 పాయింట్ల నష్టంతో 28,659 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 8,699 వద్ద ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, జీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. హిందాల్కో, కెయిర్న్‌ ఇండియా, సెసా స్టెర్లైట్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌ తదితర షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 62.76 ఉంది.