స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలాతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 87పాయింట్ల లాభంతో 28,347 దగ్గర, నిఫ్టీ 33లాభంతో 8.603దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పుంజుకోవడంతో మార్కెట్లు కోలుకునే దశలో ఉన్నాయి.
కాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మెటల్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.