స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తేనీటి విందు ఏర్పాటు చేశారు

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం తేనీటి విందు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎస్.పి.రెమా రాజేశ్వరి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,
రిటైర్డ్ ఐ. ఏ.ఎస్.అధికారి చోల్లేటి ప్రభాకర్,తిప్పర్తి జడ్.పి.టి.సి.రామి రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో స్వాతంత్ర్య సమర యోధులు దాడి వెంకట రెడ్డి,కుకుడాల దశరథ్ రెడ్డి,దాడి నారాయణ రెడ్డి,దుబ్బాక సావిత్రమ్మ,మిర్యాల కమలమ్మ,కల్వకుంట్ల స్వరాజ్యం,గుండబోయిన అచ్చన్న,పెన్నా అనంత రామ శర్మ లను రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఘనం గా సన్మానించారు .విద్యార్థిని,విద్యార్థుల చే సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతు లను అలరించాయి.