హక్కులు అడిగితే అరదండాలు

ఎమర్జెెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీ య భావాల కారణంగా ఖైదులో ఉన్న వారిని గు రించి మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది. చా లా మందే ఉన్నారు గానీ, ఎక్కువగా చర్చకు రాని ఒక బందీ అస్సాంకు చెందిన లచిత్‌ బోర్డలాయ్‌. అతన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న తూర్పు అ స్సాం నుంచి గౌహతికి బస్సులో వస్తుండగా దింపి అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేష న్‌లో అతని పైన తీవ్ర అభియోగాలతో కేసులు పె ట్టారు. అన్ని కేసుల సారాంశం, అతినికి ఉల్ఫా (యునైటైడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం) తో సంబంధాలున్నాయనేది. చివరికి జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద వారంటు జారీ చేశారు.

ఆ వారంటును నాసా కింద నెలకొల్పిన సల హా మండలి (అడ్వైజరీ బోర్డు) ఒకే చేసింది. కాబ ట్టి అతను ఇంకొక్క సంవత్సరం జైల్లో ఉండబోతా డు. అతని పైన ఒకరిని కొట్టాడన్న అభియోగం లే దు. ఒక బాంబు దొరికిందన్న ఆరోపణ లేదు. ఒక హత్యతో గానీ రైలు పట్టాల పేల్చివేతతో గానీ సం బంధం ఉందన్న నింద లేదు. భారత ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారత ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికీ ఉల్ఫాతో కలిసి కుట్ర చేశాడన్నది అతనిపైన అభియోగం ఉల్ఫాతో ఆక్షేపణీయమైన సంబంధాలు పెట్టుకున్నాడని మీడియా కూడ అతని  గురించి రాసింది.

పెట్టుకున్నాడన్నా, ఆక్షేపణీయమైన సంబంధ మే అయినా అది నేరం ఎట్లా అయిందో ? లచిత్‌ బోర్డలాయ్‌ రాజకీయభావాల గురించి మళ్లీ మాట్లా డుకుందాంగానీ, ఇప్పుడు మూడేళ్లుగా అతను ప్ర ధానంగా కృషి చేస్తున్నది  శాంతి సాధన కోసం  ఈశాన్య భారత రాష్ట్రలలో అందులో భాగంగా అ స్సాంలో అనేక సాయుధ పోరాటాలు నడుస్తున్న సంగతి తెలిసిందే ఆప్రాంతం ఎన్నో జాతులకు ని లయం. అందులో చాలా వాటి భాషా సంస్కృతులు భారత ‘ప్రధాన స్రవంతి’కి భిన్నమైనవి వైష్ణవమ తం దానితో పాటు బెంగాలీ భాషా సంస్కృంతులు ప్రసారమైన మేరకే అవి భారతీకరణ చెందాయి. అది అస్సామీల్లో అత్యధికంగా, నాగా, మిజో జా తుల్లో అత్యల్పంగా జరిగింది.

ఈ జాతులలో కొన్ని ‘మాకు ఇండియాతో ఏం సంబంధం ?’ అన్న ప్రశ్నతో స్వతంత్ర అస్తిత్యం కో రుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే స్వాతం త్య్రం కోరుకున్నా. ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కో రుకున్నా, కేవలం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కో రుకున్నా , అన్ని జాతులలోనూ సాయుధ పోరాట సంస్థలున్నాయి. అవెందుకనే ప్రశ్నకు జవాబు సు లభంగా దొరదు గానీ ఈశాన్య భారతంలో అడు గడుగునా సాయుధ పోరాటాలు నడుస్తున్న సంగతి సత్యం ఇంగ్లండ్‌ నుంచి ఇండియా అరువు తీసుకు న్న ప్రజాస్వామ్య నమూనా దేశ ‘ప్రధాన స్రవం తి’లో అన్నీ కాకున్నా కొన్ని ఆకాంక్షలకు  జవాబు చెప్పగలిందేమోగానీ, దానికి వెలుపల ఉన్న ఈ ఆకాంక్షలను తనలో ఇముడ్చుకోలేక పోయింది.

డబ్బులు వెదజల్లి అవకాశవాదాలను తయా రు చేసుకోవడం, సైన్యాన్ని దించి అణచివేత ప్రయోగించడం, వల్లగానప్పుడు చర్చలకు ఆహ్వా నం పంపడం ఆ ప్రాంతంలో పాలనా విధానంగా ఉంది. దీని వల్ల ఆ ప్రాంత ప్రజా జీవితంలో అ శాంతి, హింస, భయం ప్రధాన విషయాలుగా ఉ న్నాయి. లచిత్‌ బోర్డలాయ్‌ వంటివారు చాలామం ది ఈ స్థానిక జాతీయవాదం పట్ల ఆకర్షితులై దాని కి అనుగుణంగా తమ కార్యచరణను మలచుకు న్నారు. భారత పాలకులు మర్యాదగా అడిగినదే ఇ వ్వకపోగా కనీసం చెవి ఒగ్గరు కాబట్టి ఆయుధాలు పట్టుకోకపోయినా, ఏ హింసాకూ పాల్పడకపోయి నా సాయుధ రూపం తీసుకున్న జాతి పోరాటాల ఆలోచనలకు బాహాటంగానే మద్దతు ఇచ్చారు.

ఆ పోరాటం స్ఫూర్తిని నిలబెట్టడం తమ కర్త వ్యంగా భావించారు. దానిని అణచడానికి ప్రభు త్వం అనుసరించిన  విధానాలను వ్యతిరేకించే కర్త వ్యాన్ని మీద వేసుకున్నారు. లచిత్‌ ప్రత్యేకించి ఈ కార్యరంగాన్నే ప్రధానంగా ఎంచుకున్నాడు. అ స్సాంలో పనిచేస్తున్న ‘మానవ్‌ అధికార్‌ సంగ్రాం స మితి’ (మాస్‌) అనే మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలంక పనిచేశాడు. ప్రస్తుతం ఆ సంస్థ సలహాదారుగా ఉన్నాడు. అయితే కాలక్ర మంలో లచిత్‌ వంటి వారికి ఈ హింసా ప్రతిహిం సలు తమ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయ నీ రాజకీయ పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడం చాలా అవసర మని తోచింది.

ప్రభుత్వం గౌరవ ప్రదమైన రాజకీయ పరిష్కా రానికి సిద్ధపడితే సాయుధ పోరాట సంస్థలను కూ డా ఆ దిశగా ఆలోచించేటట్టు చేయడం సాధ్యమని వారు నమ్మారు. 2005లో పౌర సమాజానికి చెం దిన 27 సంస్థలతో ‘అస్సాంలో శాంతి ప్రక్రియ ప్ర జా కమిటీ(పీసీపీఐఏ) అనే వేదిక ఏర్పడింది. ఈ వేదిక ఏర్పాటులో లచిత్‌ పాత్ర ప్రధానమైనది. సా యుధ పోరాట సంస్థలతో ప్రభుత్వం రాజకీయ చ ర్చలు జరపాలని ఆందోళన చేయడం ఈ వేదిక ల క్ష్యం. ఈ క్రమంలో ఉల్ఫాతో కేంద్ర  ప్రభుత్వం చ ర్చలకు సిద్ధమయింది.

ఉల్ఫా తరపున చర్చలలో పాల్గొనే ప్రతినిధి బృందాన్ని నియమించమని ప్రభుత్వం కోరగా ఆ సంస్థ ఒక బృందాన్ని నియమించింది. అందులో ఇందిరా గోస్వామి అనే ప్రముఖ రచయిత్రితో బా టు లచిత్‌ కూడ ఉన్నారు. ప్రజా సంప్రదింపుల బృందం (పీపుల్స్‌ కన్సల్టేషన్‌ గ్రూపు) అని పిలవబ డుతున్న ఈ బృందానికి లచిత్‌ చైర్మన్‌గా వ్యవహారి స్తున్నాడు. ఇరు పక్షాలనూ ఒక దగ్గరికి తెచ్చి చర్చ లు జరిగేటట్టు చూడడానికి ఈ బృందం కృషి చేస్తు న్నది. అయినప్పటికీ ఆ చర్చల ప్రక్రియ  సంక్షో భంలో పడింది. దీనికి ఎవరు బాధ్యులనేది ఇక్కడ అప్రస్తుతం లలిత్‌ మాత్రం బాధ్యుడు కాడు.

అతను చైర్మన్‌గా ఉన్న ప్రజా సంద్రింపులు బృందానికి బాధ్యత కాదు. అయితే చర్చల ప్రక్ర ియ సంక్షోభంలో పడిన తరువాత లచిత్‌ బోర్డలా య్‌కి ఉల్పాతో సంబంధాలున్నాయని ప్రభుత్వం క నుక్కుంది. అతని పైన కేసుల మీద  కేసులు పెట్టి చివరికి నాసా వారంటు జారీ చేసింది. ఉల్ఫా ఒక సాయుధ ముఠాకాదు.

‘ఉల్ఫాతో సంబంధాలున్నాయి. అనే నిందాత్మ కమైన ప్రయోగం ఈ తేడాను చెరిపేస్తుంది. సం బంధాలు ఉండటం అంటే హింసాకాండలో భాగ స్వామ్యమేనన్న అభిప్రాయం కలిగిస్తుంది. ఆ  నిం ద వేసి కేసులు పెట్టి జైలులో పారేస్తే అది శాంతి భధ్రతల పరిరక్షణ లో భాగంగా జరిగిందని విచక్ష ణ ఎరుగని వారు అనుకోవాలన్నది దాని వెనుక ఉ న్న ఉద్ధేశ్యం రాజకీయ చర్చలు కాంక్షనీయం అని ప్రభుత్వం భావించినప్పుడు ఉల్ఫాను ఇక రాజక ీయ సంస్థగా గుర్తించినట్టు కదా ? మీ ప్రతినిధి బృందాన్ని పంపండి అన్నప్పుడు ఉల్ఫాతో రాజకీ య సంబంధాలున్న వారు అస్సామీ సమాజంలో ఉన్నట్టు  గుర్తించినట్టు కాదా? అది రాజకీయ పరి ష్కారానికి ప్రయోజనకరం అని గుర్తించినట్టు కా దా ? సమస్య ఎక్కడొస్తుందంటే మిలిటెంట్‌ పోరా టాలతో చర్చ జరిపే విషయంలో ప్రభుత్వాలు ఎ ప్పుడూ ఒకే గొంతుతో మాట్లాడవు.

ఇందులో పోలీసులూ సైన్యము ముఖ్యులూ ప్రజాభిప్రాయం ఎప్పుడూ రాజకీయ పరిష్కారం వై పే ఉంటుంది. కాబట్టి వీళ్లు మొదట్లో మౌనం  పా టిస్తారు. చర్చలను సాగనిస్తారు. అయితే ఎక్కడెక్క డ ఆ ప్రక్రియను సంక్షోభంలో పడోయొచ్చు చూసి దెబ్బవేస్తారు. చివరకూ అది ఏ సంక్షోభంలో పడ్డ ప్పుడు రంగంలోకి దిగుతారు. చర్చల ప్రక్రియల ను ఇంకా అసాధ్యం చేయడమే కాదు. దా ని ప్రతిష్టను కోలుకోలేనంత దిగజార్చాలని చూస్తారు.

లచిత్‌ బోర్డలాయ్‌ ఉల్ఫాతో కలిసి హింసాత్మ చర్యలకు కుట్ర చేశాడని కేసులు పెట్టడం ఈ క్ర మంలో భాగంగా జరిగినదే ఉల్ఫా నడవడిలోనూ, ఆ నడివడిక విషయంలో లచిత్‌ వంటి ప్రజాతంత్ర వాదులు మౌనం పాటించిన వైనంలోనూ ఈ కుట్ర కు  దోహదం చేసిన చేసిన విషయాలేవి  లేవని కాదు. లచిత్‌ గానీ అతను నాయకునిగా ఉన్న ని హక్కుల సంఘం మాస్‌ గానీ ప్రశ్నించకపోవడం వారి విశ్వసనీయతకు దెబ్బే.

సాయుధ పోరాట రాజకీయాలను కూడ రాజకీయాలుగా చూసి రాజకీయంగా వ్యవహరిం చాలనడం వేరు, వారి సాయుధ చర్యలు అన్యాయ మైన రూపం తీసుకున్నప్పుడు కూడా మౌనంగా ఉండడం వేరు. ఈ తప్ప నిర్భందాన్నే ఏకైక పరి ష్కార మార్గంగా ఎంచుకున్న వారి ఎత్తుగడలకు బ లం చేకూరిస్తుందన్న సృహను ప్రజాతంత్రవాదుల ను దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ప్రజాతంత్ర ఉద్య మం. అంతరంగిక విమర్శలేక ఆత్మవిమర్శ దీని అ ర్థం. ఈ లోపం ఆసరాతోప్రజాతంత్ర రాజకీయ ప్రయత్నాలనే అసాధ్యం చేసే పోలీసు, సైనిక సం స్థల కుతంత్రాన్ని గురించి చేతులెత్తాలని కాదు.

– కె.బాలగోపాల్‌