హద్దులు దాటుతున్న పాకిస్తాన్

భారత సైన్యం విజయవంతంగా జరిపిన లక్షిత దాడులతో బరితెగించిన పాకిస్తాన్ సీమాంతర కాల్పులను విచ్చలవిడిగా కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు విఫల యత్నాలు చేస్తూనే ఉంది. వీటికి భారత సైన్యం గట్టిగా జవాబిస్తోంది. దీంతో పాకిస్తాన్ స488x-1రిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు వందసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్ మరోసారి తెగబడింది. జమ్మూకాశ్మీర్ లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు వీలుగా పాకిస్తాన్ సైన్యం ఆదివారం కాల్పులు జరిపింది. ఇటు ఉగ్రవాదులను, అటు పాకిస్తాన్ బలగాలను ఎదుర్కొనే క్రమంలో ఇద్దరు భారత సైనికులు వీరమరణం పొందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం ఆదివారం ఉదయం 8.40 గంటల నుంచి నాలుగు చోట్ల భారత సైనిక పోస్టులు, పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.