హరితహారం మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి

మల్దకల్ అక్టోబర్ 20 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం రైతు వేదిక భవనంలో గ్రామపంచాయతీ  కార్యదర్శులు,సాంకేతిక సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ ,వాచ్ అండ్ వాట్స్ తో హరితహారం పై సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ కృష్ణయ్య, ఎంపిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ,ఏపీవో స్వామి, ఫారెస్ట్ ఆఫీసర్ రాఘవేందర్, పాల్గొని చెట్లు పెంచే విధానంపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.వాచర్సు చెట్లు చనిపోయిన స్థానంలో కొత్త వాటిని నాటాలని కొన్ని రహదారులు వెంబడి మేకలు గొర్రెలు తింటున్నాయని వాటిని పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.అధికారులు మాత్రం తూతూ మంత్రంగా సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు.