హరితహారం మొక్కలు కాపాడాలి

రోజుకొకరు నీరుపోసి రక్షించాలి: మంత్రి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలనిమంత్రి జోగురామన్న మరోమారు పిలుపునిచ్చారు. వర్షాభావంతో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తలా ఒకరు రోజుకు కొన్ని నీళ్లు పోసినా మొక్కుల బతుకుతాయని అన్నారు. హరితతెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణెళి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. చెట్లను నరకటం వలన మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా మొక్కలు

నాటిస్తున్నారని చెప్పారు.గ్రావిూణ ప్రాంతాల్లో చాలా మంది ఉపాధి హావిూ పనుల్లో ఎలాంటి పనులు ఉన్నాయో తెలియక పనులు చేసే అవకాశం కోల్పోతున్నారని మంత్రి అన్నారు. వారందరికి హరితహారంలో మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు. నాలుగోత విడత హరితహారంలో కూడా గ్రామాల్లోఅత్యధిక మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటటంతోపాటు వాటిని సంరక్షించాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో 230 కోట్లు మొక్కలను నాటటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అడువుల నరికే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతిఒక్కరూ సామాజిక భాద్యతగా హరితవిప్లవం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిఇంట్లో రెండు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.