హావిూల అమలుకు ఎంపిల పట్టు

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆంద్రప్రదేశ్‌ ను దేవుడో, కేంద్ర ప్రభుత్వమో రక్షించాలని కాంగ్రెస్‌ ఎమ్‌.పి టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయాలని ఆయన అన్నారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై జీరో అవర్‌లో మాట్లాడారు.ఎపిలో జీతాలు,పెన్షన్లు చెల్లించే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. ప్రత్యేక ¬దాపై ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. విభజన ద్వారా ఇచ్చిన హావిూలను ఇరు రాష్టాల్ల్రో అమలు చేయాలన్నారు. కాగా వి.హనుమంతరావు కూడా దీనిపై మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆయన పోడియంలోకి దూసుకు వెళ్లారు.దీనిపై కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ స్పందిస్తూ… ఏపీ, తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నామని స్పష్టం చేశారు. బ్జడెట్‌ ప్రసంగంలో అరుణ్‌జైట్లీ ఈ విషయం స్పష్టంగా చెప్పారని తెలిపారు.